



మొన్న మొన్న రూ.20 లక్షలు వరద బాధితులకు తక్షణ సాయంగా సి.ఎం. సహాయ నిధికి ఇచ్చిన జగన్ ఈ రోజు ఒక కోటి రూపాయలతో వరద బాధితులకు నిధి ఏర్పాటు చేసారు. ఇందుకు సాక్ష్ గ్రూప్ ఉధ్యోగులు తమ ఒక రోజు వేతనన్ని ఇవ్వటం తో ఇది కోటి ఎనభై వేలకు చేరింది. నేనిది వరకే ఒక టపాలో పేర్కొన్నాను “జగన్ ! మీరు కేవలం కడప ఎం.పి.కాదు భావి ముఖ్యమంత్రి” అని గుర్తుచేసిన సంగతి విదితమే.
నా టపా చూసి అని కాకుండా నా ఆలోచనా తరంగాలు వై.ఎస్. ఆత్మ ద్వారా జగన్ బాబుకు చేరినట్టుందనే భావిస్తా. కీప్ ఇట్ అప్ జగన్ ! హేట్స్ ఆఫ్ !
ఈ నేపద్యంలో సి.ఎం.గా రోసయ్య పరిపాలన పై పట్టు సాధించాలని కక్రుతి పడో ఏమో కొన్ని కీలక మార్పు చేర్పులకు ఉపక్రమించారు. ( డి.జి.పి.బదిలి గురించి కాదు నా ప్రస్తావన. అది దాదాపుగా వై.ఎస్. నిర్ణయమే.దానిని రోసయ్య అమలు చేసారంతే) నేను సూచిస్తున్నది మంత్రి వర్గ విస్తరణ.
పాపం రోసయ్య ! చంద్రగుపుతుడైతే కొంత ఓపిక చేసుకుంటే చానక్యుడు కాగలడేమో గాని చానక్యుడు చంద్ర గుప్తుడు కావాలనుకోవడం ఉత్త కలే. అది కాంగ్రెస్ పార్టికి పీడ కల కాకూడదని ఆశిస్తాం.
సభాష్ కే.సి.ఆర్ :
కే.సి.ఆర్ గతంలో తలకు మాసిన ప్రకటనలు ఎన్ని చేసి ఉన్నప్పటికి దిల్లిలో నేడు చేసిన ప్రకటన ఒక రాజకీయ మలుపు. శాసన సభను సమావేశపరచాలని కోరారు. కీప్ ఇట్ అప్ కె.సి.ఆర్




అవును తండ్రి మరణానంతరం హైదరాబాదుకే పరిమితమైన జగన్ అన్న ప్రజల్లోకి వచ్చారు. ఇడుపుల పాయలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు, తండ్రి సమాధివద్ద శ్రద్దాంజలి గడించారు. ఇడుపులపాయలో ఉండి తదుపరి వై.ఎస్.ను బలి కొన్న పావురాల గుట్టకు సైతం వెళ్తున్నారు. జగన్ కు ప్రజల్లో ఉన్న మద్దత్తును ఆదిష్ఠానం ఇప్పతికన్నా గుర్తించకుంటే రాష్ఠ్ర పార్టి పుట్టడం తద్యం,
ఎన్.టి.ఆర్ కు వై.ఎస్.ఆరుకు ఉన్న ఏకైక తేడా ఇది ఒకటే .ఆ వ్యత్యాసాన్ని సైతం జగన్ బద్దలు చేసి తండ్రిని మించిన తనయుడనిపించాలి. ప్రత్యేక పార్టి ఏర్పాటు చెయ్యాలి. పేరు కాంగ్రెస్ (వై.ఎస్.) అని పెడితే సరి పోయేదిగా


More Options ...
Categories
Tag Cloud
Blog RSS
Comments RSS

Void « Default
Life
Earth
Wind
Water
Fire
Light 