డా. వై.ఎస్.పై నాకున్న అభిమానంతో ,2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టి విజయానికి కృషి చేసిన హక్కుతో ఈ టపా వ్రాస్తున్నాను. జగన్ బాబు ! రాజకీయం అన్నది ఎన్నికల సమయంలో మాత్రం అందుకునే పాట కాదు. అది అను నిత్యం కొనసాగవలసిన బ్యేక్ గ్రౌండ్ మ్యూజిక్ ,ప్రజా సమస్యలనే లిరిక్ ని అనగ త్రొక్కక కొన్సాగుతూనే ఉండాలి.
వై.ఎస్. దివంగతులయ్యారు. నా బోటి వారు నిన్నే సి.ఎం. చేస్తారని ఆశతో ఉన్నాం. మా ఆశ అడియాశైంది. పోనీ తలచినదే జతిగినదా దైవం ఎందులకన్నట్టుగా దీనిని పాజిటివ్ గానే తీసుకుంటాం.
ఇప్పుడు దైనందిన సమస్యలన్నింటిని పక్క దోవ పట్టించి కే.సి.ఆర్ తన దుబాకోరు దీక్షతో తెలంగాణ సమస్యను తెరమీదికి తెచ్చారు. నాకు తెలిసి నాన్న గారు ఈ విషయమై ఏ మాట చెప్పి ఉన్నా ఆయన మనస్సులో మాత్రం సమైక్యాంద్ర ప్రదేశ్ కే చోటు.
రాష్ఠ్ర రాజకీయాల్లో ఇదొక కీలక జంగ్షన్ పాయింట్. ఇక్కట మనమేదో ఒకటి నిర్ణయించుకోవలసిన అవసరం ఉంది. ఇదో ఎత్తైతే మరో ప్రక్క అటు అదిష్ఠాణం కాని ,ఇటు సీనియర్లు కాని ,ప్రత్యర్దులు కాని సాకు దొరికినప్పుడల్లా నీ మీద దొంగ దెబ్బ కొడుతూనే ఉన్నారు. వారు త్రవ్విన గోతిలో వారే పడటం ఖాయం. సీనియర్లని విర్రవీగే వారికి కుక్కలకున్న జ్ఞానం కూడ లేదు. కుక్క బ్రతుకు బ్రతికినప్పుడు తమ యజమాణి మనోగతాన్ని పసిగట్టి నడుచుకోవాలి. కాని వీరు అధినేత్రి పైనే వత్తిడి తెచ్చే స్థాయికి వెళ్ళి పోయారు. జగన్ బాబు నీవు విధేయత ప్రకటించాలన్నా ఇదే అదను. తిరగబడాలన్నా ఇదే అదను.
అసలే ఇది కలి కాలం నిద్ర పోతునా కాళ్ళాడిస్తూనే ఉండాలి లేకుంటే చచ్చి పోయామని ప్రెస్ మీట్ పెట్టేసే కాలమిది. మరో విషయం ఏమంటే ఇదివరకే ప్రకటించినట్టుగా వై.ఎస్. మరణానంతరం ప్రాణాలు పోగొట్టుకున్నవారి కుటుంభాలను ప్రామర్శించటానికి బయలు దేరాలి. మంచి తనాన్ని చేతగాని తనంగా తీసుకునే వారితో ఎంత మంచిగా
ఉన్నా అది చేతగానితనంగానే పరిగణించ పడుతుంది. జస్ట్ యు కం విత్ అన్ అజెండా . ప్లీస్ బి క్విక్
endhuku raa jagan,inka ee rastranni peekku thinadanikaa?