అవును రాష్ఠ్ర మంత్రి కొండా సురేఖా తమ రాజినామాను ఏకంగా గవర్నరుకు సమర్పించారు.
వై.ఎస్. మరణానంతరం చోటు చేసుకున్న వివిధ పరిణామాలతో సురేఖ ఇదివరకే రోశయ్య అనాయకత్వంలో ఇమడలేనని చెప్పిన మాట వాస్తవమే. కాని జగన్ సోనియా భేటి అనంతరం కాస్త మనస్సు గట్టి చేసుకుని మరి ఉన్న సురేఖను మీడియా రెచ్చ కొట్టిందిమాట మార్చిన సురేఖా అని హెడ్డింగులు పెట్టి మరి వ్రాసారు. డా.వై.ఎస్. ఉన్నంత కాలం ఆయన మోచేతి నీరు త్రాగి బ్రతికిన వారు నేడు తమ స్వంత భలంతో నెగ్గామని బీర వచనాలు పలుకుతుంటే సురేఖవంటి సునిత మనస్కురాలు ఎంత బాధ పడి ఉందేదో మనమే ఊహించుకోవచ్చు.

స్త్రీ మూర్తిలోని త్యాగం, అమ్మతనమే మూర్తిభవించిన సురేఖ రాజకీయంగా వదులుకున్నది ఒక్క పదవే కావచ్చు. కాని తఠస్థులు సైతం ఆమె త్యాగానికి తలవంచక తప్పదు.

ఒక మనిషి బ్రతికి ఉండగానే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే ఘనులున్న రోజుల్లో (ఉ. చంద్రబాబు) వై.ఎస్. మరణానంతరం కూడ ఆయన పట్ల గౌరవంతో ఇంతటి సాహసానికి దిగిన సురేఖలో నాటి ఝాన్సి లక్ష్మి కనిపిస్తుంది.

ఎవరితోను సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె చెప్పినప్పటికి దానిని చిన్న పిల్లలు సైతం నమ్మరు. పోని ఇంత కాలానికి జగన్ బాబులో ఈ తెగింపు రావడం హర్షణీయం.
రోశయ్యా ! నువ్వు దిగి పోయే ఘడియలు దగ్గర్లోనే.

వై.ఎస్.పేరు చెప్పి, వై.ఎస్. మానవీయ పథకాలతో ,సాక్షి టి.వి, దినపత్రికలు కూడ పెట్టిన మద్దత్తుతో కేవలం 1 శాతం ఓట్ల తేడాతో ఎం.ఎల్.ఏలై మంతౄలైన వారంతా రాజినామా చేస్తే వారి పేర్లు కూడ చరిత్రలో నిలిచి పోతాయి.

లేకుంటే చంద్రబాబు ఎలా అన్ పాపులర్ అయ్యారో, ఎలా విశ్వసనీయతను పోగొట్టుకునారో ఆ దుస్థితి వీరికి కూడ తప్పదు

RTS Perm Link

Tags Categories: Konda surekha Posted By: swamy7867
Last Edit: 29 Oct 2009 @ 09 20 PM

EmailPermalinkComments (1)

అవును ఈ రోజు మద్యాహనం టి.వి. లో నక్సలైట్ నేత కిషన్ జి మాటలు విన్నాను. (అది మొబిలె ఇంటర్వ్యూ అని చేనల్ చెప్పినప్పటికి అది కేవలం రికార్డు చేసిన మాటలే అని నా ఊహ) పాపం ఆయన వై.ఎస్.ఆర్ ను, జగన్ ను నానా మాటలు అంటుంటే నాకు నవ్వొచ్చింది.
కిషన్ జి ఒక్కసారి ఊహించుకో !
నువ్వు కడపలో పుట్టావు. బాంబుల కడప ! నీ తండ్రి ఒక ఫేక్షనిస్టని ముద్రపడిన దురద్రుష్ఠవంతుడు. నువ్వు డాక్టరుకు చదివావ్. నీ తండ్రి ఆసుపత్రిలో దర్మవైద్యం చేస్తావా ? సరే పోని కావల్సినన్ని ఆస్తులున్నాయి. కాలేజిలో చదివినప్పుడే ట్యేక్సు కాట్టినవాడివనుకో. నీకు రాజకీయాలతో పనే లేదు. కాని వచ్చావు. అప్పట్లో రాజీవుకున్న ఆకర్షణ అటువంటిది. కాంగ్రెస్ వంటి హిప్పాక్రటిక్, అప్రజాస్వామిక, దళారుల, పార్టిలో కొన్సాగావు. 1949 లో పుట్టిన నువ్వు 2003 దాక కేవలం ఒక జిల్లాకే పరిమితమై ఉన్నావు. ఆ తరువాత పాద యాత్ర చేపడతావు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో అంటే 2004 లో నీ 55 వ ఏట వేరే గత్యంతరంలేని పరిస్థితిలో ఆదిష్ఠానం నిన్ను సి.ఎం చేసింది.
అంతకు పూర్వం పరిపాలించిన వాడు అసలు ముఖ్యమంత్రే కాదు ప్రపంచ బ్యాంకు జీతగాడని పేరు తెచ్చుకున్న పెద్ద మనిషి. తనను సి.ఇ.ఓ గా చెప్పుకున్న వ్యక్తి. అతనెలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డాడంటే …………………………………………………………………………………………………………………………………………………………………………… (ఖాళీలను నీవే పూరించుకో) ఆ తరువాత సి.ఎం.కుర్చి ఎక్కిన వై.ఎస్. కేవలం చంద్రబాబు చేసిన తప్పిదాలను సరి దిద్దేసి పడకేసి నిద్ర పోయున్నా వై.ఎస్. దేవుడే అయ్యేవాడు. అంతగా రాష్ఠ్ర ప్రజలు బాబు పాలనతో విసిగి వేసారి పోయున్నారు. కాని ఆయన ఎంతగా శ్రమించారంటే ……………….దానిని మాటల్లో చెప్పలేను.

మీలా అడవుల్లో దాక్కుని, హోం గార్డులను, కానిస్టబుళ్ళను చంపుకుంటూ, డబ్బా చేనల్సుకు భీర వచనాలు పలుకుతు ఉండే పని కాదు వై.ఎస్.ది. అటు దిల్లి నవాబులు, ఇటు స్వంత పార్టిలోని శల్యులు , గుంట నక్కను మించిన బాబులాంటి ప్రతిపక్ష నేత. ఎప్పుడు ఎటు పోతారో తెలీని కమ్యూనిస్టులు. ( వారి దుంప తెగ శ్రీలంక తమిళులను ఊచకోత కోస్తుంటే వీరు నెత్తిన పెట్టుకుని ఊరేగే కమ్యూనిస్టు దేవుడు ఫెడరల్ కేస్ట్రో నేత్రుత్వం వహించే దేశం శ్రీలంక పై ఇతర దేశాలు తెచ్చిన ఖండన తీర్మాణాన్ని సైతం భలపరచలేదు. అట్టి కమ్యూనిస్టులు ఒక ప్రక్క ,డ్రగ్ అడిక్ట్ కన్నా మోసమైన మనస్థితిలోని కే.సి.ఆర్ , పరిపాలకుడు మారినా తమ తీరు మార్చుకోని అధికార గణం, వారిని దారిన పెట్టే కర్కశం లేక చూసి చూడనట్టు ఉపేక్షించిన వై.ఎస్.ఆర్ ములాజకు పోయి ముండ మోసాడు. దిక్కు లేని చావు చచ్చాడు.

మీరు అడవుల్లో దాక్కుని ఆయుధాలు పట్టి సాధించ లేని ఎన్నో విషయాలను వై.ఎస్.సాధించాడు. అత్యున్నత శిఖరాలకు ఎదిగాడు. చంద్ర బాబు కూడ ఉన్నాడు. తిన్నాడు. ఏం లాభం ? కిషన్ జి వై.ఎస్. ఉన్నంత కాలం మీ తోకలు మీ ప్యేంటు జేబుల్లా ఉన్నాయి. ఇప్పుడేమో ర్యేక్ & రోల్ చేస్తున్నాయి.

ప్రజల కోసం ,ప్రజా పక్షమని రెచ్చిపోవడం కాదు . వాస్తవంగా ప్రజా పక్షం వహించే వారైతే జన హ్రుదయాన్ని అర్థం చేసుకున్న వారైతే వై.ఎస్. మానవీయ పథకాలు అమలు కావాలని నినదించండి. జన జీవణ శ్ర్వంతిలోకి రండి.

ప్రజలు చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నారు. విసిగి వేసారి పోయున్నారు. ఇప్పుడు జనాన్ని కదిలించే ఓంకారం కేవలం డా.వై.ఎస్.అనే అక్షరాలే. ఈ చిన్న సెంటిమెంటును అర్థం చేసుకోక వై.ఎస్.పై నిందలు మోపి ఇంకాస్తా ప్రజలకు దూరమయ్యారు . అడవుల్లో దాక్కుని ఫిసికల్ గా దూరంగానే ఉన్నారు. ప్రస్తుతం సైకలాజికల్ గా కూడ దూరమవుతారు. ఆలోచించండి. ప్రజల స్రేయస్సే మీ ద్యేయమైతే వై.ఎస్. మానవీయ పథకాల అమలుకు వత్తిడి తెండి.
పథకం అమల్లో బ్యూరాక్రటిక్ తప్పిదాలుంటే ఎత్తి చూపండి. జనం మెచ్చుకుంటారుkishanji

RTS Perm Link

Tags Tags:
Categories: politics
Posted By: swamy7867
Last Edit: 25 Oct 2009 @ 08 21 PM

EmailPermalinkComments (0)
 21 Oct 2009 @ 7:06 PM 

మానవుడు అడవులను వదిలి ,సంచార జీవితం గడిపి ,ఆ పై స్థిరవాసం గైకొన్నాడు. అక్కడికి పరిపాలన వ్యవస్థ యొక్క అవసరం వచ్చింది. నాటికి నేటికి ఎన్నో పరిపాలనా వ్యవస్థలు వచ్చాయి. ఆధునిక మానవుడు ప్రజాస్వామ్యాన్ని అత్యుత్తమ పరిపాలనా వ్యవస్థగా గుర్తించాడు. రాజరికం , అరిస్టోక్రసి (మేధావుల గ్రూపు పరిపాలిస్తూంది) నియంత్రుత్వం ,సైన్యాధికారం ఇలా ఎన్నో వ్యవస్థలు చరిత్ర పుటల్లో కనిపిస్తాయి.

అది ఏ వ్యవస్థ అయినప్పటికి పాలకుడు/పాలకులు సామాన్యుల గోడు పట్టించుకుని ప్రతి పౌరునికి ప్రాణ రక్షణ, కూడు గుడ్డ, గూడులను అందించాలి. ప్రజలు స్స్వావలంభణతో గౌరవ ప్రదమైన జీవనం గడిపేలా వ్యవసాయ,పరిశ్రమ రంగాలను , సదరు రంగాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చాలి. అప్పుడే సమగ్రాభివృద్ది సాధ్యం. ఇవన్ని సాధ్యం చేసిన పాలకుడు రాజైనా, భంటైనా ( భంటులు కూడ పరిపాలించినారు .ఒట్టు !) కమేండరైనా, మేధావి అయినా, నియంత అయినా ,ప్రజాస్వామ్య బద్దంగా ఎంపికైన నేత అయినా సరే చరిత్రలో వారి పేరు స్వర్ణాక్షరాలతో లిఖింప పడుతుంది.

అలా రాష్ఠ్రాభివృద్దికి ,రాష్ఠ్ర ప్రజల అభ్యున్నతికి పాటు పడిన నేత డా.వై.ఎస్.ఆర్. అందుకే ఆయన పేరు రాష్ఠ్ర రాజకీయ చరిత్రలోనేకాక ,దేశ ,ప్రపంచ రాజకీయ చరిత్రలోకెక్కింది. సుస్థిర స్థానం సంపాదించుకుంది. సరే ! వై.ఎస్. అమరులయ్యాక ఆయనగారి జీవిత చరిత్రను రచించడం ఏల ? ముద్రించడం ఏల ? దీంతో సమాజానికి ఏం లాభం అని కొందరు ప్రశ్నించవచ్చు.

ఈ బూమి పైకి వచ్చినప్పుడు మానవుడు ఎంతో పవిత్రతతో, స్వార్థం, కల్లా కపటాలకు ఏ మాత్రం తావు లేని వాడుగా ఉంటాడు. అతనలా పెరుగుతుంటే సమాజంలోని కుళ్ళు,కుతంత్రం ,స్వార్థం వంటివి అతనిలోకి ప్రవేశిస్తూనే ఉంటాయి. కాని యవ్వనంలో తనలో ఉరకలేసే శక్తి కారణంగా ఏ మాత్రం అభద్రతా భావానికి గురికాక, సమాజంలో తాను చూసే కుళ్ళు,కుతంత్రం ,స్వార్థాలను ఎండ కదుతుంటాడు. వ్యతిరేకిస్తాడు. పోరాడుతాడు. కాని యవ్వనం కరిగి పోతుంటే ,శక్తి తరిగి పోతుంటే తాను వ్యతిరేకించి పోరాడిన కుళ్ళు,కుతంత్రం ,స్వార్థాలకు లొంగి పోతాడు. (కొందరు యవ్వనంలోనే వీటికి లొంగి పోవచ్చు వీరు శ్రీ శ్రీ పేర్కొన్న పుట్టుకతో వృద్దులు )

ఈ సమయంలో యువత ఇదివరకే కుళ్ళు,కుతంత్రం ,స్వార్థం వీడి తనవారికి కోసంసర్వస్వము అర్పించే వాడే అసలైన కథానాయకుడు అన్న నిర్వచనానికి ప్రాణం పోసి,ప్రజా సేవకే అంకితమై ,కారణ జనుములుగా, చారిత్రిక పురుషులుగా చరిత్రలో నిలిచి పోయిన మహానుభావుల చరిత్రలను అద్యయనం చెయ్యాలి. వారిలో ఏ ఒకరినైన తమ ఆదర్శ పురుషులుగా వరించుకుంటే వారి మనోభలం ఇరుముడిస్తుంది. దీంతో యువత మాతృ భూమి, మాతృ భాషల ,పేద బడుగు వర్గాల ,పరిరక్షణకు నడుంకట్టే వీలు దొరుకుతుంది. “మనుషులు రుషులై ఎదగాలంటే పుణ్య చరితలే ఆధారం.”

“మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ.
పట్టుదలే ఉంటే కాగలడు మరో భ్రహ్మ “

అటువంటి పట్ట్దుదలను ఇవ్వగల పుణ్య చరత్ర డా.వై.ఎస్.గారిది. కేవలం బాంబులకే ప్రఖ్యాతి గాంచిందన్న అపఖ్యాతికి గురైన మాతృభూమిని యావత్ ప్రపంచమే కీర్తించే విదంగా చేసిన డా.వై.ఎస్. జీవిత చరిత్ర యువతకు ఆదర్శంగా , స్ఫూర్తి దాయికంగా ఉంటుంది అన్న ప్రగాడ విశ్వాసంతో ఈ చిన్ని గ్రంథాన్ని చిత్తూరు పట్టణ వ్యాపరస్తులు, కాంగ్రెస్ పార్టి ప్రముఖులు, రాజకీయ క్రికేట్లో ఫోర్ కొట్టిన బహదూర్ శ్రీ. సి.కె.బాబు గారి అభిమానుల సహకారంతో ఇండియన్ పొలిటికల్ క్లోసప్ తెలుగు పక్ష పత్రిక విడుదల చేస్తుంది. ప్రతి యువత వై.ఎస్.జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, వై.ఎస్. పెంపకంలో ఆయన నేర్పి , నూరి పోసిన నిస్వార్థం, కర్తవ్య నిర్వహణ, త్యాగం, విశ్వసనీయత, మానవీయత ,ప్రజా సేవలతో వై.ఎస్.ప్రతిరూపంగా మన మద్య ఉన్న వై.ఎస్. తనయుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని భలపరచాలని కోరుతున్నాను.

ఇట్లు
చిత్తూరు.ఎస్.మురుగేషన్ ,
ఎడిటర్,

RTS Perm Link

Tags Categories: politics Posted By: swamy7867
Last Edit: 21 Oct 2009 @ 07 06 PM

EmailPermalinkComments (0)
\/ More Options ...
Change Theme...
  • Users » 3381
  • Posts/Pages » 457
  • Comments » 757
Change Theme...
  • VoidVoid « Default
  • LifeLife
  • EarthEarth
  • WindWind
  • WaterWater
  • FireFire
  • LightLight

ABOUT ME



    No Child Pages.