దేవధర్మం

చాలాకాలం క్రితం కాశీరాజుకు పట్టపు రాణియందు ఇద్దరు కొడుకులు కలిగారు. రాజు వారికి మహింసాసుడనీ, చంద్రకుమారుడనీ పేర్లు పెట్టాడు. మహింసాసుడే బోధిసత్వుడు. చంద్రకుమారుడు పసివాడుగా ఉండగానే తల్లి తీరని వ్యాధి సోకి హఠాత్తుగా చనిపోయింది.
అప్పుడు రాజు మరొక భార్యను పెళ్ళాడి, ఆమెను పట్టపురాణిని చేశాడు. ఆమె రాజుకు ప్రేమపాత్రురాలుగానూ, అనుకూలవతిగానూ ఉంటూ, కాలక్రమాన తాను కూడా ఒక అందమైన పిల్లవాణ్ణి కన్నది. వాడికి సూర్యకుమారుడని పేరు పెట్టారు. రాజు ఒకనాడు ఈ పుత్రుణ్ణి చూసి ఎంతగానో సంతోషించి పట్టపురాణితో, ‘‘నీ కొడుక్కు ఏదైనా వరం ఇస్తాను కోరుకో,’’ అన్నాడు.
‘‘మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు. అయితే, ఇప్పుడు కాదు, నాకు కోరాలనిపించినప్పుడు వరం అడిగి పుచ్చుకుంటాను,’’ అన్నది పట్టపురాణి.
కొంత కాలానికి సూర్యకుమారుడు యుక్తవయస్కుడయ్యాడు. అప్పుడు పట్టపురాణి రాజుతో, ‘‘నాకు కొడుకు పుట్టినప్పుడు వరం ఇస్తానన్నారు. జ్ఞాపకం ఉన్నది కదా? ఇప్పుడా మాట చెల్లించి, నా కొడుక్కు రాజ్యం ఇయ్యండి,’’ అన్నది.
‘‘అగ్నిజ్వాలల లాగా ప్రకాశించే పెద్ద కొడుకులు ఇద్దరుండగా నీ కొడుక్కు రాజ్యం ఇవ్వటం ఏ ధర్మమూ అంగీకరించదు. అందువల్ల అది సాధ్యం కాదు,’’ అన్నాడు రాజు.
రాణి ఆగ్రహం చెందింది కాని, అప్పటికేమీ మాట్లాడకుండా మౌనం వహించింది.
ఆమె తన పెద్ద కొడుకులకు హాని చేయవచ్చునని రాజుకు అనుమానం కలిగింది. ఆయన ఒకనాడు మహింసాసుణ్ణీ, చంద్రకుమారుణ్ణీ చేర పిలిచి, ‘‘అబ్బాయిలూ, నేను సూర్యకుమారుడు పుట్టిన సమయంలో మీ పినతల్లికి ఒక వరం ఇస్తానన్నాను. ఆమె ఇప్పుడు సూర్యకుమారుడికి రాజ్యం ఇవ్వమని కోరుతున్నది. నేను అందుకు అంగీకరించలేదు. అయితే దురాశ ప్రళయాంతకమైనది. అది రాజ కుటుంబంలో మరింత హాని కలిగిస్తుంది. ఆమె మీకు ఏదన్నా కీడు చేయవచ్చు. అందుచేత మీరు వెంటనే అరణ్యాలకు వెళ్ళి, నేను కన్ను మూశాక తిరిగి వచ్చి, ఈ రాజ్యం ఏలుకోండి,’’ అని చెప్పాడు.
ఇదేమీ సూర్యకుమారుడు ఎరగడు. ఒక నాడు తన అన్నలు చెప్పాపెట్టాకుండా రాజభవనం దిగి ఎక్కడికో ప్రయాణం అవుతూ ఉండటం చూసి, ఆశ్చర్యపోయాడు. అన్నలతోపాటు బయలుదేరాడు.
ముగ్గురు అన్మదమ్ములూ కొన్నాళ్ళకు హిమాలయాల మీదికి వెళ్ళారు. బోధిసత్వుడు దారికి ఎడంగా ఉన్న ఒక చెట్టు కింద కూర్చుని సూర్యకుమారుడితో, ‘‘తమ్ముడూ, ఆ కనిపించే కొలనుకు వెళ్ళి, స్నానం చేసి, దాహం తీర్చుకుని, మా ఇద్దరికీ తాగటానికి తామరాకులతో నీరు పట్టుకురా,’’ అన్నాడు.
ఆ కొలను ఒక జలరాక్షసుడైన యక్షుడిది. కుబేరుడు దాన్ని ఆ జలరాక్షసుడి కిచ్చి, దేవధర్మం ఎరిగిన వారిని విడిచి పుచ్చమనీ, అది తెలియనివాళ్ళు ఎవరైనా కొలనులో దిగితే వారిని భక్షించమనీ, కొలనులోకి దిగనివారి జోలికి పోవద్దనీ చెప్పాడు.
అది మొదలు ఆ యక్షుడు కొలనులో దిగిన ప్రతి మనిషినీ, ‘‘దేవధర్మం ఏమిటి?’’ అని అడిగి, చెప్పలేని వారిని భక్షిస్తూ వస్తున్నాడు. అందుచేత, సూర్యకుమారుడు కొలనులోకి దిగగానే ఆ యక్షుడు అతణ్ణి అడ్డుకుని, ‘‘నీకు దేవధర్మం తెలుసునా?’’ అని అడిగాడు.
‘‘తెలుసు; దేవధర్మం అంటే ఆకాశంలో వెలుగుతూన్న సూర్యచంద్రులు,’’ అన్నాడు సూర్యకుమారుడు.
‘‘నీకు దేవధర్మం తెలియదు,’’ అని యక్షుడు సూర్యకుమారుణ్ణి కొలను లోపల ఉన్న తన నివాసానికి తీసుకుపోయి అక్కడ ఉంచాడు.
జాతక కథలులో భాగంగా చందమామలో వచ్చిన ఈ కథ పూర్తిపాఠాన్ని కింది లింకులో చదవండి.
దేవధర్మం
మౌనమే దీటైన సమాధానం
పిల్లల కథల్లో మనదే పెద్ద స్థానం. పంచతంత్ర కథలు, అక్బర్ బీర్బల్ కథలు, భట్టివిక్రమార్క కథలు, కాశీమజిలీ కథలు, జాతక కథలు, బేతాళ కథలు…. ఇలా మనకున్న కథా సంపద అపారం. 16వ శతాబ్దంలో పేరొందిన కథల్లో ముఖ్యమైనవి బీర్బల్ కథలు. మాట విరుపుతో, మెరుపు యోచనతో ఎంత క్లిష్టమైన పరిస్థితినయినా ఎలా అధిగమించవచ్చో తెలిపే చక్కటి కథలివి.
శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో తెనాలి రామలింగడిలాగా, అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో బీర్బల్ది తిరుగులేని స్థానం. -తెనాలి, బీర్బల్ ఇద్దరూ ఓ రకంగా సమకాలికులు కూడా-. ఈ స్థానమే తోటి సభికులకు, రాజోద్యోగులకు కంటగింపుగా మారి, చక్రవర్తి సమక్షంలో బీర్బల్ను కుయుక్తులతో పడగొట్టాలని వారు ప్రయత్నించిన ప్రతి సందర్భంలోనూ బీర్బల్ తనకే సముచితమైన సమయస్ఫూర్తితో వారి ప్రయత్నాలను వమ్ము చేస్తాడు.
మౌనానికి గల శక్తి వివేక సంపన్నులు మాత్రమే గ్రహించగలరని, అసంబద్ధ ప్రశ్నలకు మౌనమే దీటైన సమాధానమని ఈ వారం బీర్బల్ ధారావాహిక 18వ భాగం కథ “మూర్ఖుల ప్రశ్నలకు దీటైన సమాధానం” బోధిస్తోంది. అదేంటో ఇక్కడ చూడండి.
మూర్ఖుల ప్రశ్నలకు దీటైన సమాధానం
విజయం విజేతకు ఆనందాన్నిస్తుంది. అతడి మిత్రులకూ, శ్రేయోభిలాషులకూ సంతోషాన్నిస్తుంది. తక్కిన వారిలో ఈర్ష్యాసూయలకు కారణమవుతుంది. ఇక శత్రువుల సంగతి చెప్పనవసరం లేదు. అసూయతో కుతకుతలాడిపోతారు. బీర్బల్ విషయంలో కూడా సరిగ్గా అదే జరిగింది.
బీర్బల్ సమయస్ఫూర్తితో సమస్యలను పరిష్కరించి చక్రవర్తి అభిమానాన్ని చూరగొన్నప్పుడల్లా సభలో కొందరు అసూయతో దహించుకు పోయేవారు. బీర్బల్ను చక్రవర్తి అభిమానానికి దూరం చేయడం ఎలాగా అని ఆలోచించేవారు.
వాళ్ళు ఒకనాడు సమావేశమై తమ ఆశ ఫలించడానికి రకరకాల మార్గాల గురించి చర్చించారు. ఆఖరికి తిరుగులేని పథకం అని ఒక దాన్ని రూపొందించుకుని, అది గనక నెరవేరినట్టయితే బీర్బల్ పని అయిపోయినట్టేనని సంబరపడి పోయారు!
మరునాడు అలాంటి అసూయాపరుల నాయకుడు షైతాన్ఖాన్ తన అనుచరులతో కాస్త ముందుగానే సభకు వచ్చాడు. ముఖ్యమైన చర్చలు, కార్యకలాపాలు పూర్తయ్యాక చక్రవర్తి సభికుల నుంచి సూచనలు, కొత్త కొత్త సలహాలు స్వీకరించడానికీ, ఆసక్తికరమైన విశేషాలు వినడానికీ సమాయత్తమయ్యాడు.
షైతాన్ఖాన్ లేచి నిలబడి చక్రవర్తి అనుమతి కోసం ఆగాడు. ‘‘చెప్పు,’’ అన్నాడు చక్రవర్తి.
‘‘షహేన్షా! మనకందరికీ బీర్బల్ తెలివితేటల గురించి తెలుసు. ఆయన ఎంతో కుశాగ్రబుద్ధి కలవాడు కదా,’’ అన్నాడు షైతాన్ఖాన్.
‘‘గొప్ప వివేకవంతుల మధ్య ఉన్న అనుభూతి నాకు కలుగుతోంది షహేన్షా,’’ అన్నాడు బీర్బల్ సంతోషంగా.
‘‘నిజమే షహేనషా! చమత్కార సంభాషణలో ఆయనకు సాటి రాగలనని నేను భావించడం లేదు. అంతే కాదు. క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో మనలో ఏ ఒక్కరం కూడా బీర్బల్కు సాటి కాలేము,’’ అన్నాడు షైతాన్ఖాన్.
ఆ తరవాత అతడు స్వరం తగ్గించి, ‘‘బీర్బల్ ఇంత కుశాగ్రబుద్ధిగా వున్నాడు. మరి, ఆయన్ను కన్నతండ్రి మరెంత మేధావిగా ఉంటాడో కదా?’’ అన్నాడు చక్రవర్తితో.
ఆ మాటతో చక్రవర్తిలో కుతూహలం పుట్టుకువచ్చింది. ఇన్నాళ్ళు తనకీ యోచన రానందుకు ఆశ్చర్యపోయాడు.
ఈ కథ పూర్తి భాగంకోసం ఇక్కడ చూడండి.
బీర్బల్ కథలు ధారావాహికలో ఇంతవరకు ఆన్లైన్ చందమామ ప్రచురించిన 18 కథలు చూడాలంటే, ఈ లింకుపై క్లిక్ చేయండి.
Filed under చందమామ కథలు | Tags: అక్బర్, ఆస్థానం, కథలు, కాశీమజిలీకథలు, చందమామ, చందమామకథలు, చక్రవర్తి, జాతకకథలు, తండ్రి, పంచతంత్ర కథలు, బీర్బల్, సమయస్పూర్తి | Comment (0)ఇష్టం లేని పని చేయవలసి వస్తే….
ఇష్టపడి చేసేది కష్టమైనా సరే సంతోషంగా చేస్తారు అని నానుడి.. మరి, లౌకిక వాంఛలవల్ల కలిగే అనర్థాలను గుర్తించి, సన్యాసం అవలంబించి, యాభై ఏళ్ళపాటు హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకుంటూ గడిపిన కృష్ణద్వైపాయనుడు కాని, జగత్ప్రసిద్ధి పొందిన దాతలు తాతా, తండ్రీ మార్గాన్ని అనుసరిస్తూ వచ్చిన మాండవ్యుడు కాని, పసితనంలోనే ఓ భర్తకు భార్యగా మెట్టింటికి వచ్చి జీవితం గడిపిన మహిళ కాని ఎందుకు తమ తమ విధులను ఇష్టంగా చేయలేకపోయారు.
అందుకు వారికి జీవితంలో ఒరిగిందేమిటి….? చివరికి వారికి మిగిలిందేమిటి…? పేమాభిమానాలు లేకుండానే సంవత్సరాల పాటు కాపురం చేసిన భార్య చివరకు అనివార్య పరిస్థితుల్లో ఈ చేదునిజాన్ని భర్తకే చెప్పవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు, తర్వాత ఆ భార్య గతి ఏమిటి? వంటి మౌలిక విలువల సారాన్ని తెలుసుకోవాలంటే ఈ కింది కథను చదవండి. అనుభవం ప్రాతిపదికగా మనిషిలో కలిగే పరివర్తనను అద్భుతంగా చెప్పిన ఈ జాతక కథను మీరు తప్పక కింది లింకులో చదవండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=37&sbCId=93&stId=2254
మీ స్పందనను abhiprayam@chandamama.com పంపండి.
Filed under చందమామ కథలు | Tags: కాపురం, చందమామ, జాతకకథలు, తపస్తు, దానం, పరివర్తన, బోధిస, బోధిసత్వుడు, లోకంతీరు | Comment (0)చివరి శ్వాసవరకు చందమామ తోటే ఉంటా…

శంకర్ గారి బేతాళ కథలు
చందమామ చిత్రకారుడు శంకర్ గారి మాటల్లోనే చెప్పాలంటే ఆయన ఉద్యోగ జీవితం 1946లోనే మొదలైంది. 1952లో చందమామలో చేరారు. అంటే ఆయన మొత్తం ఉద్యోగ జీవిత కాలం ఇప్పటికి 64 ఏళ్లు. వయస్సు 85 ఏళ్లు. దేహం పండిపోయి, సహకరించని కాళ్లతో, భారంగా అడుగులేస్తూ కూడా, పనిచేయకపోతే పొద్దు పోదనే పాత తరం సంస్కృతికి నిలువెత్తు అద్దంలా నిలుస్తూ, చందమామతో నిండు జీవితం పండించుకున్న నిరుపమాన వ్యక్తి శంకర్ గారు.
నాగిరెడ్డి గారి పేరు చెబితే నిలువెల్లా కదిలిపోవడం శంకర్ గారి నైజం. కేవలం వారు తనకు అందించిన మంచి అవకాశం కారణంగానే చందమామతో తన జీవితాన్ని ముడివేసుకున్నానని చెబుతారాయన. ఇదే విషయంపై మాట్లాడుతూ ‘Till my last breath… I will be with Chandamama’ (చివరి శ్వాస వరకు చందమామతో ఉంటా..) అని ఉద్వేగంగా ప్రకటించారు.
చిత్రాగారు కుంచెతో, తాను చేతితో గీసే విధానం పట్ల అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయిన సందర్భంలో ‘చిత్రా, శంకర్లు చందమామలో జోడెద్దుల్లాంటి వారు. పని సజావుగా సాగేంతవరకు వారి ఇచ్ఛప్రకారమే పనిచేయవచ్చు’ అని నాగిరెడ్డిగారు గతంలో అన్న వ్యాఖ్యలను తలచుకునీ మరీ కదిలిపోయారు.

శంకర్ గారితో సంభాషణ
చివరిశ్వాస వరకు చందమామతోనే ఉంటా అని ప్రకటించుకోవడం శంకర్ గారి మూర్తిమత్వపు గొప్పే తప్ప మరొకటి కాదు. నేటి ఆధునిక చిత్రకారుల ఉద్యోగ జీవితాలతో పోలిస్తే ఆయన ఎవరూ ఊహించలేనంత తక్కువ వేతనం ప్రాతిపదికనే చందమామలో దశాబ్దాలుగా పనిచేశారు. దానికి ఆయన ఏ రోజూ బాధపడింది లేదు.
శంకర్ గారి పరిచయం రెండో భాగం పూర్తి పాఠం చదవాలంటే కింది లింకును చూడండి
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2211
శంకర్ గారి పరిచయం తొలి భాగం పూర్తి పాఠం చదవాలంటే కింది లింకును చూడండి.
http://www.chandamama.com/lang/story/stories.php?lng=TEL&mId=12&cId=49&stId=2203
మీ స్పందనను abhiprayam@chandamama.com కు తప్పక పంపండి.
Filed under చందమామతో మా జ్ఞాపకాలు | Tags: ఆచార్య, ఎంటీవీ, చందమామ, చిత్ర, చిత్రకారులు, జాతకకథలు, పాపయ్య, బేతాళ కథలు, మహాభారతం, రామాయణం, వడ్డాది, వపా, శంకర్ | Comment (0)






