మా టీవీలో యండమూరి ఇంటర్వ్యూ ..
ఇవాళ మా టీవీ ‘పెళ్ళి పుస్తకం’ ప్రోగ్రాంలో యండమూరి వీరేంద్రనాథ్, ఆయన భార్య గీత ఇంటర్వ్యూ చూసాను. చూడటానికి ఆవిడ సింపుల్ గా బాగున్నారు. ఆయన మాటలు ఎప్పుడూ వింటూనే ఉంటాము, పుస్తకాలల్లో చదువుతూనే ఉంటాము.కానీ ఆయన గురించి,ఆయన రచనల గురించి,ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన భార్య మాటల్లో విందామని ఆ ప్రోగ్రాం చూసాను.కానీ ఆవిడ అసలు ఎక్కువ మాట్లాడనేలేదు. ప్రోగ్రాం అంతా ఆయనే మట్లాడారు.ఆ మాట్లాడింది కూడా ఆయన పుస్తకాలల్లో చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పారు. ఆయన పుస్తకాలల్లో చెప్పిందంతా ఆయన నిజ జీవితంలో ఎంత ఆచరించారో ఏవన్నా ఉదాహరణలతో చెప్తారేమో అనుకున్నా.. ప్రత్యేకించి వాళ్ళ ఆవిడ అలాంటివేమన్నా చెప్తే విందామనుకున్నా.కానీ ఇద్దరూ అలాంటి మాటలేమీ చెప్పలేదు..
ఈ ప్రోగ్రాం లో అతిపెద్ద లోపం యాంకర్ ఝాన్సీ.ఆవిడ అసలే ఏమి మాట్లాడట్లేదు అంటే, ఈవిడేమో ”యండమూరి గారి రచనలలో హీరోయిన్లు చాలా తెలివైన వాళ్ళు ఉంటారు కదా, మీరూ అలాగే ఉంటాను అనుకుంటున్నారా?” లాంటి పిచ్చి ప్రశ్నలతో చావగొట్టేసింది.అప్పటికప్పుడు నోటికొచ్చిన,అర్థంలేని ప్రశ్నలు అడగటం,ప్రశ్నల కోసం తడుముకోవటం తప్ప,మన యాంకర్లు ఎవరినన్నా ఇంటర్వ్యూ చేసే ముందు ఆ వ్యక్తికి సంబంధించిన కనీస విషయ సేకరణ చెయ్యాలని, ఇంటర్వ్యూలో అడగబోయే విషయాలు, ప్రశ్నలకు సంబంధించి కొంతయినా ముందస్తు ప్రిపరేషన్ ఉండాలని ఎప్పుడు అర్థం చేస్కుంటారో కదా అనిపించింది.ఆయన అభిప్రాయాలు,ఆలోచనలు ఆయన పుస్తకాలు,ఇంటర్వ్యూల ద్వారా జనాలకి ఎంతో కొంత తెలుసు కాబట్టి ఝాన్సీ ఆవిడతో ఎక్కువ మాట్లాడించేలా ప్రశ్నలు తయారు చేస్కుని ఉండాల్సింది అనిపించింది.
ఇంకా ఎప్పుడు నేర్చుకుంటావ్ ఝాన్సీ??
As a whole, నాకు ఈ ప్రోగ్రాం పెద్దగా నచ్చలేదు.